జల్నా: మహారాష్ట్రలోని షిర్డీలో గురువారం పర్యటించిన ప్రధాని మోదీ మరాఠా కోటాపై స్పందించకపోవటాన్ని మరాఠా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే తప్పుబట్టారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్లే ఇందుకు కారణమని, రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని మోదీ వద్ద వారు లేవనెత్తలేదని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం దీక్షాస్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, ‘మరాఠా రిజర్వేషన్లపై ప్రధాని మోదీ స్పందిస్తారని ఎంతో ఆశించాం. కానీ అలా జరగలేదు. ప్రధాని మోదీ, సీఎం షిండే, ఫడ్నవీస్ తీరు నిరాశపర్చింది’ అని అన్నారు.