ఔరంగాబాద్: పబ్లిక్ వర్క్స్ శాఖలో ఇంజినీర్గా పనిచేస్తున్న సంజయ్ రాజారామ్ పాటిల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ లంచం కేసులో అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 855 గ్రాములు బంగారం, 27 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పీడబ్ల్యూడీ శాఖలో సెక్షన్ ఇంజినీర్గా సంజయ్ చేస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 40వేల లంచం తీసుకుంటుండగా అతన్ని పట్టుకున్నారు. అదే రోజున పాటిల్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇంటి నుంచి 1.63 లక్షల నగదుతో పాటు 183 గ్రాముల గోల్డ్ను సీజ్ చేశారు.