చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి స్పందించారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులు క్షేమంగా బయటపడాలని తాను ప్రార్ధిస్తున్నానని అన్నారు. ప్రమాద ఘటన నేపధ్యంలో ఇటీవలే సేకరించిన ఈ హెలికాఫ్టర్లపై అంతర్గత విచారణ చేపట్టాలని అభిషేక్ సింఘ్వి డిమాండ్ చేశారు.
తయారీదారు నుంచి సమగ్ర వివరాలు రాబట్టాలని అన్నారు. కాగా హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం నలూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది.