Today History: పాకిస్థాన్ సైన్యం బంధీగా ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. భారత్ సహా వివిధ దేశాల ఒత్తిళ్ల కారణంగా 2019 లో సరిగ్గా ఇదే రోజున ప్రాణాలతో విడుదలయ్యాడు. పాకిస్థాన్కు చెందిన జెట్ ఫైటర్ ఎఫ్-16 ను కూల్చివేసిన అభినందన్.. అనుకోకుండా పాక్ సైన్యానికి చిక్కి దాదాపు 60 గంటల పాటు వారి కస్టడీలో ఉన్నాడు. మూడు రోజుల పాటు యుద్ధఖైదీగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందాడు.
పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో.. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖరు దాటుకుని పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. దీనిని గమనించిన అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానంతో నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి బెదిరించాడు. భూమికి 15 వేల అడుగుల ఎత్తులోకి తన మిగ్ను తీసుకెళ్లిన అభినందన్.. అక్కడి నుంచి పాక్ ఎయిర్క్రాఫ్ట్ను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపాడు. దీంతో అది తిరుగుముఖం పట్టినప్పటికీ.. అభినందన్ దాన్ని వదిలేయకుండా వెంటాడాడు. ఈ పోరాటంలో అభినందన్ విమానం పాకిస్థానీ భూభాగంలోకి వెళ్లగా.. పాకిస్థాన్ సైన్యం దీన్ని కూల్చేశారు. దాంతో పారాచూట్ సాయంతో కిందికి దిగిన అభినందన్ను పాకిస్థానీ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నది.
అభినందన్ను అప్పగించాలని భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాక్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అదే ఏడాది మార్చి 1న అభినందన్ను పాక్ సైన్యం భారత్కు అప్పగించింది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి విధుల్లోకి చేరిన అభినందన్కు.. భారత ప్రభుత్వం 2019 లో వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. పాక్తో ఘర్షణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ వర్ధమాన్కు భారత ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. విండ్ కమాండర్ నుంచి ఆయనను గ్రూప్ కెప్టెన్గా నియమించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..