పంజాబ్లో ఆమ్ఆద్మీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. రాజకీయా దిగ్గజాలు జాడా లేకుండా పోయారు. వారందర్నీ ఆప్ అభ్యర్ధులు చిత్తుచిత్తుగా ఓడించేశారు. పంజాబ్ సీఎం చెన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్, మాజీ సీఎం, సుఖ్బీర్ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్… వీరందరూ ఓడిపోయారు. వీరందరికీ ప్రజలు ఝలక్ ఇచ్చారు.
చరణ్జిత్ సింగ్ చెన్నీ : అంతర్గత కలహాల కారణంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. దీంతో అధిష్ఠానం చెన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజకీయ వాతావరణం కారణంగా చెన్నీని ఈ సారి రెండు స్థానాల నుంచి బరిలోకి దిగాలని ఆదేశించింది. భదౌడా, చమకౌర్ సాహిబ్ నుంచి ఆయన బరిలోకి దిగారు. రెండు చోట్లా ఓడిపోయారు. ఆప్ అభ్యర్థులు ఈయన్ను ఓడించారు.
నవజ్యోత్ సింగ్ సిద్దూ : అమృత్ సర్ ఈస్ట్ నుంచి ఈయన బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అజయ్ గుప్తా అనే ఆప్ అభ్యర్థి సిద్దూను ఓడించారు. పీసీసీ పదవిలో కొనసాగుతారా? లేదా? అన్నది సందిగ్ధంలో పడింది.
ఓపీ సోనీ : పంజాబ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అమృత్ సర్ మధ్య ప్రాంతం నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి అజయ్ గుప్తా చేతిలో ఓడిపోయారు.
అమరీందర్ సింగర్ : చాలా కాలం పాటు సీఎంగా కొనసాగారు. అంతర్గత కలహాల కారణంగా అమరీందర్ సింగ్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో పాటియాలా నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి అజీత్ సింగ్ కోహ్లీ చేతిలో అమరీందర్ ఓడిపోయారు.
సుఖ్బీర్ సింగ్ బాదల్ : శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. జలాలాబాద్ నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో ఓడిపోయారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ : మాజీ ముఖ్యమంత్రి. శిరోమణి అకాలీదళ్ అగ్రనేత. ప్రస్తుతం 93 సంవత్సరాలు. అయినా… లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు.