న్యూఢిల్లీ, జనవరి 18: ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం అధికార ఆప్ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ నోట్ల కట్టలను ప్రదర్శించారు. నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ దవాఖానలో తాత్కాలిక సిబ్బంది నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కాంట్రాక్టరు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించాడని ఎమ్మెల్యే చెప్పారు. కాంట్రాక్టరు నుంచి ప్రాణహాని ఉన్నదని తెలిపారు. దీంతో స్పందించిన స్పీకర్ విషయం చాలా తీవ్రమైనదని, దీన్ని అసెంబ్లీ పిటిషన్ల కమిటీకి పంపుతున్నానని పేర్కొన్నారు.