న్యూఢిల్లీ : వక్ఫ్బోర్డులో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు ఢిల్లీ కోర్టు సోమవారం మరో 14 రోజులపాటు జ్యుషీడియల్ కస్టడీ విధించింది. ఈ నెల 16న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేయగా.. రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు కోర్టు కస్టడీ విధించింది. మరో వైపు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై రేపు కోర్టులో వాదనలు జరుగనున్నాయి.
అమానతుల్లా ఖాన్ చైర్మన్గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఆపరేషన్లో ఆర్థిక దుర్వినియోగం, ఇతర అక్రమాలకు సంబంధించిన కేసుకు సంబంధించి కేసులో ఇంతకు ముందు ఏసీబీ సమన్లు జారీ చేసింది. బోర్డులో జరిగిన అవినీతికి సంబంధించి ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాన్ ప్రభుత్వ నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘించి అక్రమంగా 32 మందిని నియమించుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ ఆరోపించింది.