న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ పదవిని దుర్వినియోగం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించింది. చైర్మన్గా ఉన్నప్పుడు ముంబైలోని ఖాదీ లాంజ్లో తన కూతురు సివంగి సక్సేనాకు అక్రమంగా ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్టు ఇప్పించారని తెలిపింది. వెంటనే ఆయనను ఎల్జీ పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేసింది. ఎల్జీపై వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ డిమాండ్చేశారు.