న్యూఢిల్లీ: శ్రద్ధా వాల్కర్ను చంపిన తర్వత ఓ డాక్టర్తో నిందితుడు అఫ్తాబ్ డేటింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా వాల్కర్ శరీరాన్ని ముక్కలుగా కోసి .. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి.. ఆ సమయంలో ఇంటికి మరో అమ్మాయిని అఫ్తాబ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సంచలన మర్డర్ కేసులో విచారణ కొనసాగిస్తున్న పోలీసులు మరో కొత్త విషయాన్ని తెలిపారు. శ్రద్ధాను కలిసిన బంబ్లీ డేటింగ్ యాప్ ద్వారానే డాక్టర్కు పరిచయం అయినట్లు తేల్చారు. ఆ లేడీ డాక్టర్ ఓ సైకాలజిస్ట్ అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
డేటింగ్ యాప్ బంబ్లీకు ఢిల్లీ పోలీసులు విచారణలో భాగంగా లేఖ రాశారు. ఆ యాప్ ఆధారంగా అనేక మంది మహిళలతో అఫ్తాబ్ చాటింగ్ చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అఫ్తాబ్కు పాలీగ్రాఫ్ పరీక్ష చేస్తున్నారు. ఆ తర్వాత అతనికి నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించనున్నారు. పాలీగ్రాఫ్ టెస్ట్కు సంబంధించిన అన్ని సెషన్స్ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.
అంబేద్కర్ హాస్పిటల్లో సోమవారం అతనికి నార్కో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సహజీవనం చేస్తున్న శ్రద్ధాను అఫ్తాబ్ 35 ముక్కలుగా కోసి చంపిన విషయం తెలిసిందే. శ్రద్ధాకు చెందిన పుర్రెతో పాటు ఇతర శరీర భాగాలను గుర్తించాల్సి ఉంది.