న్యూఢిల్లీ, మార్చి 28: పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది. జూన్ 30వ తేదీ లోపు ఆధార్తో పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పని చేయదని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 51 కోట్ల మంది తమ పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకున్నారు. గతంలో కూడా అనేకమార్లు ఆధార్ – పాన్ లింక్ గడువును కేంద్రం పొడిగిస్తూ వచ్చింది. 2022 ఏప్రిల్ 1 నుంచి లింక్ చేసుకునే వారికి రూ.500 జరిమానా, 2022 జూలై 1 నుంచి లింక్ చేసుకుంటున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నది.