న్యూఢిల్లీ, జూన్ 15: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం 8 గంటల పాటు ప్రశ్నించింది. దీంతో రాహుల్ను ఈడీ మూడు రోజుల్లో 30 గంటల పాటు విచారించినట్లయింది. శుక్రవారం కూడా విచారణకు హాజరవ్వాలని అధికారులు రాహుల్కు సూచించారు. గురువారం విచారణకు హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని రాహుల్ కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. కాగా, ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పలు ప్రాంతాల్లో బుధవారం కూడా ఆందోళనలకు దిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోకి బలవంతంగా చొరబడిన ఢిల్లీ పోలీసులు అక్కడి సిబ్బంది, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీన్ని పోలీసులు తోసిపుచ్చారు.