న్యూఢిల్లీ : ఇద్దరు బాలికలు 2022కు క్యూట్ ఎండింగ్ ఇచ్చేలా మెస్మరైజింగ్ వీడియోతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. భారత్లో ఇప్పుడు ఈ రెండే ట్రెండింగ్ అంటూ వారు తేల్చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నింగ్మర్ యోంజన్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఏకంగా 20 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో ఓ బాలిక స్టీల్ గ్లాస్ను మైక్రోఫోన్గా ఉపయోగిస్తూ భారత్లో ఇప్పుడు ఏం జరుగుతోందని మరో బాలికను అడుగుతుండటం కనిపించింది. ఆపై రియాక్టయిన మరో చిన్నారి మేరే ఇండియా మే అంటూ లతా మంగేష్కర్ ఆలపించి పాక్ బాలిక ఆయేషా రీమిక్స్ వెర్షన్తో అదరగొట్టిన మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్కు అద్భుతమైన స్టెప్స్తో అలరించింది.
ఇంకా ఏం నడుస్తున్నాయని ప్రశ్నించగా ఇన్స్టాగ్రాంలో సూపర్ హిట్ అయిన పత్లి కమారియ మోరి పాటను ఆలపిస్తూ కిల్లర్ మూమెంట్స్తో అదరగొట్టింది. బాలికల పెర్ఫామెన్స్కు ఫిదా అయిన నెటిజన్లు కామెంట్ బాక్స్పై వారిపై ప్రశంసలు గుప్పించారు. క్యూట్నెస్ ఓవర్లోడ్ అని ఓ యూజర్ రాసుకురాగా, చిన్నారి ముఖంపై చిరునవ్వు మెరిసిందని మరో యూజర్ కామెంట్ చేశారు.