లక్నో: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో (Mainpuri) ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. డ్రైవర్ లారీని ఆపకుండా కారును సుమారు అర కిలోమీటర్ దూరం అలానే లాక్కెళ్లాడు. ఈ క్రమంలో మరో బైకు కూడా ప్రమాదానికి గురైంది. అయితే స్థానికులు లారీని వెంబడించడంతో 500 మీటర్లు వెళ్లిన తర్వాత ఆపాడు. అయితే కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
సమాజ్వాదీ నాయకుని కారును లారీ ఢీకొట్టిందని, 500 మీటర్లకుపైగా దూరం అలాగే తీసుకెళ్లిందని జిల్లా ఎస్పీ కమలేశ్ దిక్షంత్ చెప్పారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేశామన్నారు. ఇది హత్యా యత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
#WATCH A truck dragged the car of SP District President Devendra Singh Yadav for about 500 meters in UP's Mainpuri pic.twitter.com/86qujRmENr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022