ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్నాథ్ షిండే అజిత్పవార్కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతేగా పవార్ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మది మందిని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ఈ అనూహ్య పరిణామాలతో మహరాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల గురించే వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితుడైన సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్తోపాటు చీలిక వర్గంలో చర్చనీయాంశమైంది.
పార్టీని చీల్చడం కోసం అజిత్ పవార్ చేసిన కుట్రలో ప్రఫుల్ పటేలే ప్రధాన పాత్ర పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెలరోజుల క్రితం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ తన కుమార్తె సుప్రియా సూలేను, పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ప్రఫుల్ పటేల్ కూడా పార్టీ చీలికలో కీలకపాత్ర పోషించడం ఆశ్యర్యకరంగా ఉంది.