పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ఒక పూజారి దుర్గాదేవికి ప్రత్యేకంగా తన భక్తిని చాటుతున్నారు. నీటితో నిండిన 21 కలశాలను ఛాతిపై పెట్టుకుని పూజలు చేస్తున్నారు. తాను తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ఉపవాసంతో ఉండటంతోపాటు ఈ కలశాలతో దీక్షలో ఉంటానని ఆ పూజారి తెలిపారు. నవరాత్రుల సందర్భంగా గత 25 ఏండ్లుగా తాను దీన్ని ఆచరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ పూజారి దీక్షను చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.