థానే: మహారాష్ట్రలోని థానే ప్రజలకు కరోనా టీకాలు వేసేందుకు థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా లింగమార్పిడి వర్గాల (ట్రాన్స్జెండర్స్) కోసం శనివారం ప్రత్యేకంగా కొవిడ్ టీకా డ్రైవ్ నిర్వహించింది. దీంతో పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ కేంద్రానికి పలువురు ట్రాన్స్జెండర్స్ వచ్చి కరోనా టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా కొందరు సెల్ఫీలు కూడా దిగారు. థానే నగరంలోని ప్రజలంతా టీకాలు తీసుకోవాలని కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు డాక్టర్ సురేశ్ ఠాకూర్ తెలిపారు. థానేలోని ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవడం తమ లక్ష్యమని అన్నారు. వైద్య అధికారులు ప్రజలకు టీకాల గురించి అవగాహన కల్పిస్తున్నారని ఆయన వెల్లడించారు.