పాట్నా: బీహార్లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చరిత్ర సృష్టించారు. 40 ఏండ్లుగా గయ నగరంలో
పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న చింతాదేవి అనే మహిళ ఇప్పుడు అదే నగరానికి డిప్యూటీ మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
ఇంతకాలం నగరానికి చింతాదేవి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజలు ఆమెను 16 వేల రికార్డు మెజారిటీతో గెలిపించారు.