Earth’s axis | న్యూఢిల్లీ: భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ఏకంగా భూమి అక్షమే మారిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 1993-2010 మధ్యకాలంలో భూగర్భ జలాల తోడివేత వల్ల భూమి అక్షం ఏటా 4.36 సెంటీమీటర్ల చొప్పున తూర్పునకు వంగినట్టు జియోగ్రాఫికల్ రిసెర్చ్ లెటర్స్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రంలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దక్షిణకొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ, క్యుంగ్పూక్ నేషనల్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, హాంకాంగ్లోని హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం కనుగొన్నారు. భూగర్భ జలాలను అధికంగా తోడివేయటం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది.