న్యూఢిల్లీ, జూన్ 4: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రమాదంపై విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్దేశిత కాల పరిమితిలో దాని నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేశారు.
రైల్వేలో భద్రతా పరిమితులు, లోపాలు, అవకతవకలు, వాటిని సరిదిద్దడానికి అనుసరించాల్సిన విధానాలు, భద్రతా వ్యవస్థ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ తగు సూచనలిచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు.