కొచ్చి: ఓ వ్యక్తికి వింత సమస్య ఎదురైంది. ఆ సమస్యకు పరిష్కారం కోసం ఆ వ్యక్తి ఏకంగా హైకోర్టుకు వెళ్లాడు. అయితే ఈ విషయంలో ఏం చెప్పాలో తెలియక కోర్టు కూడా ముందు కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కేరళలోని ఓ వ్యక్తి సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ వ్యక్తి ఇప్పటికే కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సినూ తీసుకున్నాడు. కానీ సౌదీ అరేబియాలో కొవాగ్జిన్ను గుర్తించడం లేదు.
దీంతో మరోసారి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అతడు సిద్ధమయ్యాడు. ఇందుకు అనుమతి కోరుతూ ఆ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంలో కేంద్రం స్పందన ఏంటో తెలపాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.