జైపూర్, ఆగస్టు 14: తొమ్మిందేండ్ల ఓ దళిత విద్యార్థి.. టీచర్ కోసం ఉంచిన కుండలోని నీళ్లను తాగాడు. ఇది చూసిన ఆ టీచర్ ఆ బాలుడిని చితకబాదాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘట న రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది.
గత నెల 20న తరగతి గదిలో ఉన్న సదరు విద్యార్థికి దాహం వేసింది. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న టీచర్ నీటి కుండలోని నీళ్లను తాగాడు. నా నీళ్లును తాగుతావా? అని మందలించిన టీచర్ అంతటితో ఆగకుండా విచక్షణ మరిచి తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు బాలుడు స్పృహకోల్పోయాడు. వెంటనే బడి యాజమాన్యం అతడిని దవాఖానకు తరలించింది.