ముంబై: భారత వ్యాపారుల కోసం సరికొత్త చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది. సంబంధిత టూల్స్ను ముంబైలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఆవిష్కరించింది. వర్చువల్గా హాజరైన మెటా సీఈవో జుకర్బర్గ్ కొత్త ఫీచర్స్ను పరిచయం చేశారు. వెరిఫైడ్ బ్యాడ్జ్ ద్వారా వ్యాపారులకు పలు ప్రయోజనాలు, లబ్ధి ఉంటుందని తెలిపారు.
వాట్సాప్ చాట్ ద్వారా నేరుగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. సరికొత్త ‘ఫ్లోస్’ సదుపాయం ద్వారా వినియోగదారులకు కావాల్సిన సేవల్ని అందించొచ్చన్నారు. బ్యాంక్ ఖాతాను తెరవటం, ఫుడ్ డెలివరీ, విమాన ప్రయాణ టికెట్టు..మొదలైన సేవలు వ్యాపార సంస్థలకు సులభతరం అవుతాయని ‘మెటా’ వివరించింది.