న్యూఢిల్లీ : ముంబైకి చెందిన ఓ వ్యక్తి 2023లో స్విగ్గీ (Swiggy) నుంచి ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ను ఆర్డర్ చేశారని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ముగుస్తున్న క్రమంలో ‘హౌ ఇండియా స్విగ్గ్డ్ ఇన్ 2023’ పేరుతో తన వార్షిక ఫుడ్ డెలివరీ నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది స్విగ్గీలో అత్యధిక మంది ఆర్డర్ చేసిన ఫుడ్గా బిర్యానీ ముందువరసలో నిలిచింది.
ఇక ముంబై వాసి 2023లో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ను ఆర్డర్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బిర్యానీతో పాటు కేక్స్, గులాబ్ జామ్, పిజ్జాలనూ కస్టమర్లు అధికంగా ఆర్డర్ చేశారు. ఈ ఏడాది పొడవునా సెకన్కు 2.5 సర్వింగ్స్ రేటుతో బిర్యానీని ఆర్డర్ చేశారని ఈ నివేదిక తెలిపింది. గత ఎనిమిదేండ్లుగా బిర్యానీనే అత్యధికులు ఆర్డర్ చేసిన డిష్గా చార్ట్లో టాప్గా నిలుస్తోంది.
చికెన్ బిర్యానీకి అత్యధికులు మొగ్గుచూపగా శాకాహారులు సైతం వెజ్ బిర్యానీని ఆర్డర్ చేయడం పట్ల ఆసక్తి కనబరిచారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బిర్యానీ క్రేజ్ ఓ రేంజ్లో నెలకొంది. ఆ రోజు చండీఘఢ్కు చెందిన ఓ కుటుంబం ఏకంగా 70 ప్లేట్లు ఆర్డర్ చేసిందని స్విగ్గీ రిపోర్ట్ పేర్కొంది.
Read More :