మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరులో ముగ్గురు అమ్మాయిలపై యాసిడ్ అటాక్(Acid Attack) జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కబడ పట్టణ సమీపంలోని ప్రభుత్వ ప్రీ వర్సిటీ కాలేజీలో ఆ దాడి జరిగింది. ఓ యువకుడి ఆ అమ్మాయిలపై యాసిడ్ చల్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అమ్మాయిలను ప్రైవేటు ఆస్పత్రికి మార్చారని, ప్రీ యూనివర్సిటీ కోర్సు కోసం ప్రిపేరవుతున్న సమయంలో ఆ అటాక్ జరిగిందని, కాలేజీ కారిడార్లో కూర్చున్న సమయంలో ఆ యువకుడు యాసిడ్తో దాడి చేశాడని పోలీసులు చెప్పారు.
ముఖానికి మాస్క్, నెత్తికి టోపి పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి.. తన వద్ద బాటిల్ను తీసి, ఆ అమ్మాయిల ముఖాలపై యాసిడ్ చల్లాడు. అటాక్ చేసిన వ్యక్తిని అబిన్గా గుర్తించారు. కేరళలోని కసరగడ్ జిల్లావాసి అని తేలింది. దాడి చేసి పారిపోవాలనుకున్న ఆ వ్యక్తిని, స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. కడబ పోలీసులు ఈ కేసులో విచారణను ముమ్మరం చేశారు.