న్యూఢిల్లీ: ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ కారు ఓనర్కు.. ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 26వేల ఫైన్ వేశారు. ఆ కారుపై ఓ వ్యక్తి స్టంట్స్(Car Stunts) చేశాడు. తీవ్ర రద్దీ ఉన్న రోడ్డుమీద వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి కారుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు ఓనర్కు జరిమానా విధించారు. నోయిడా సెక్టార్ 18లో ఈ ఘటన జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉంది. ఆ కారుకు ఫైన్ వేసిన చెలాన్ను ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ఆ కారు ఓనర్ పేరు మహేశ్ పాల్ అని ఉంది.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 26000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/rWERrY3NCT— Noida Traffic Police (@noidatraffic) August 16, 2023
ఎల్లో రంగ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి స్విఫ్ట్ కారు రూఫ్పై పడుకుని స్టంట్స్ చేశాడు. మరో వ్యక్తి ఆ కారును నడిపాడు. 20 సెకన్లు ఉన్న ఆ క్లిప్లో కారు దూసుకెళ్లున్న దృశ్యాలను చూడవచ్చు. కారు రూఫ్ను పట్టుకున్న ఆ వ్యక్తి వేలాడుతున్నా.. డ్రైవర్ మాత్రం ఓవర్టేక్ చేస్తూ వెళ్లాడు. నెటిజన్లు ఈ వీడియోను ఎక్స్లో పోస్టు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎంవీ యాక్ట్తో పాటు టిన్టెడ్ గ్లాసు వాడినందుకు ఫైన్ వసూల్ చేశారు.