చండీగఢ్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్కు ప్రధాన ఎన్నికల కమిషనర్ బృందం బుధవారం చేరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండేలతో కూడిన భారత ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి బృందం చండీగఢ్కు వచ్చింది. 2022లో నిర్వహించనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతను ఈ బృందం సమీక్షించనున్నది. ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు, ఇతర అధికారులతో సమావేశమవుతుంది. అనంతరం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తుంది.