చంఢీగఢ్, మే 13: యాసిడ్ దాడిలో చిన్నప్పుడే చూపు పోగొట్టుకున్న ఒక బాలిక సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్గా నిలిచి ఆశ్చర్యపరిచింది. చండీగఢ్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్లో చదువుతున్న ఖఫీ సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 95.20 శాతం మార్కులతో స్కూల్లో మొదటి స్థానం లో నిలిచింది.
తల్లిదండ్రులతో హిస్సార్లో నివసిస్తున్న ఆమెపై మూడేండ్ల వయస్సప్పుడు ముగ్గురు అకారణంగా యాసిడ్ పోశారు. తీవ్రంగా గాయపడిన ఆమె రెండు కండ్లు దెబ్బతినడంతో చూపును కోల్పోయింది. ఆమెను ఎన్ని దవాఖానలలో చూపించినా చూపు తిరిగి రాకపోవడంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్లో చేర్పించి చదివించారు.