చెన్నై: తమిళనాడులోని కాంచీపురంలో స్నేహితుడి కళ్లెదుటే యువతిపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. బెంగళూరు-పుదుచ్చేరి ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో డిగ్రీ విద్యార్థిని(19), ఆమె స్నేహితుడు కలిసి ఉండగా, మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు గమనించి మరో ముగ్గురిని పిలిచారు. ఐదుగురు కలిసి ఆమె స్నేహితుడిపై దాడి చేశారు. అతడి మెడ మీద కత్తి పెట్టి.. ఆ యువతిని పక్కకు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, వారు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.