కోల్కతా, మార్చి 18: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. గార్డెన్ రీచ్ ఏరియాలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోగా, దాదాపు 20 మందికి గాయాలయ్యాయి.
ఇంకా భవన శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు.