న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇవాళ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాకు.. ఢిల్లీ కోర్టు వచ్చే నెల 7 వరకు ఈడీ రిమాండ్ విధించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అధికారులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
అమిత్ అరోరా బడ్డీ రిటైల్ సంస్థకు డైరెక్టర్. అమిత్ అరోరాతోపాటు దినేష్ అరోరా, అర్జున్ పాండేలు సిసోడియాకు సన్నిహితులని ఈడీ వెల్లడించింది. వీరు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించడంలో చురుగ్గా వ్యవహరించారని తెలిపింది. మద్యం కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.