చెన్నై: చెన్నైలో ఓ స్కూల్ అమ్మాయిపై ఆవు అటాక్(cow attack) చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ పోలీసులు ఆ ఆవు ఓనర్ను అరెస్టు చేశారు. 9 ఏళ్ల అయేషా అనే అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోడ్డుపై ఓ ఆవు తిరగబడి ఆ అమ్మాయిని అటాక్ చేసింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. సమీప ఇంట్లో ఉన్న సీసీటీవీకి ఆ దృశ్యాలు చిక్కాయి.
ఆ ఆవు తన కొమ్ములతో విద్యార్థిని పైకి ఎత్తేసి కింద పడేసింది. ఆ అమ్మాయి అరుపులతో పాటు ఆమె తల్లి కూడా అరవడంతో.. స్థానికులు అక్కడకి చేరుకున్నారు. రాళ్లు రువ్వి ఆ ఆవును తరిమే ప్రయత్నం చేశారు. కానీ చాలా సేపు ఆ ఆవు .. కింద పడిపోయిన ఆ విద్యార్థినిపై అటాక్ చేస్తూనే ఉండిపోయింది. అయితే ఓ వ్యక్తి కర్రతో కొట్టిన తర్వాత ఆ ఆవు అక్కడ నుంచి వెళ్లిపోయింది.
నాలుగో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్ ఆ హాస్పిటల్ను విజిట్ చేశారు. ఆవు ఓనర్కు రెండు వేల ఫైన్ వేశారు.
Cows attack harmless little girl in MMDA, #Chennai. @chennaicorp Cows roaming on the streets are a big menace and a threat to motorists and walkers. Please take action against the cow owner! #Cow #CowAttack@CMOTamilnadu @UpdatesChennai pic.twitter.com/wdV5LD0iyw
— Ajay AJ (@AjayTweets07) August 10, 2023