న్యూఢిల్లీ, మార్చి 26: వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) మోసాలను అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది రూ.లక్షల్లో పోగొట్టుకొంటున్న కేసులు పెరుగుతున్నాయి. సాంకేతిక అంశాలు తెలిసిన టెకీలను కూడా బోల్తా కొట్టించి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ఐఐటీ మండి శాస్త్రవేత్తలు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
పాస్వర్డ్ ఆధారిత హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించే ‘అడాప్ఐడీ’ టెక్నాలజీని ఐఐటీ-మండి, ఐఐటీ-కాన్పూర్ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. అథెంటికేషన్ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్ యూజర్ బయోమెట్రిక్ బేస్డ్ బిహేవియర్ ప్యాటర్న్స్ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.