హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్నది. ముఖ్యంగా ముంబై మహానగరంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నది. అక్కడి సామాన్య ప్రజలతోపాటు వైద్యులు, పోలీసులు, ప్రముఖులు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ జేజే హాస్పిటల్లో 100 మందికిపైగా రెసిడెంట్ డాక్టర్లకు కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మంది వైద్యులు కరోనా బాధితులుగా మారిపోయారు.
అటు ముంబై పోలీసులలో కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో నగరానికి చెందిన 93 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దాంతో ఇప్పటివరకు ముంబైలో కరోనా బాధితులుగా మారిన పోలీసుల సంఖ్య 9,657కు చేరింది. ఒకేరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన 93 మంది పోలీసులు కరోనా బారినపడటంతో మహారాష్ట్రం ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడి కోసం చర్యలను ముమ్మరం చేసింది.