Gold Seized | ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పెద్ద ఎత్తున పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో ముంబయి కస్టమ్స్ ఎయిర్పోర్టు అధికారులు స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు.
సదరు వ్యక్తి నుంచి 9వేల గ్రాముల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో బంగారం విలువ దాదాపు రూ.4.62 కోట్లుగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తిని అరెస్టు చేసి, విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.