ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మేఘాలకు చిల్లులు (Cloudburst) పడ్డాయా అనేంతలా బార్కోట్-యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈనేపథ్యంలో వారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య వెల్లడించారు.
కాగా, ఆది, సోమవారాల్లో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచర్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే ఉత్తరాఖండ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నందప్రయాగ, భనేరోపాణి వద్ద జాతీయ రహదారి ధ్వంసమవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
#WATCH | Uttarkashi, Uttarakhand | 8-9 workers staying at an under-construction hotel site went missing after the construction site was damaged due to a cloud burst in Silai Band on Barkot-Yamunotri Marg. Yamunotri Marg has also been affected: Uttarkashi DM Prashant Arya
Rescue… pic.twitter.com/k6FiyZCdCa
— ANI (@ANI) June 29, 2025