న్యూఢిల్లీ, ఆగస్టు 1: రెండు హైకోర్టులకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జిలు, ముగ్గురు అదనపు న్యాయమూర్తులను.. అలహాబాద్ హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలను నియమిస్తూ కేంద్రం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.
సాధారణంగా అదనపు న్యాయమూర్తులను రెండేండ్ల కాలానికి నియమిస్తారు. అనంతరం శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు.