అమృత్సర్: పంజాబ్లోని (Punjab) లూథియానాలో (Ludhiana) ఘోరం ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ (Gas Leak) అవడంతో 11 మంది మరణించారు. మరో 11 మంది స్పృహకోల్పోయారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను దవాఖానకు తరలించారు. ఫ్యాక్టరీ చుట్టు పక్కల ఉన్నవారిని తరలిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో జనసామర్థం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు వలస కార్మికులేనని చెప్పారు.
గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయాన్ని కనుక్కోవడానికి 35 మంది సభ్యులు కలిగిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) బృందం ఘటనా స్థలానికి చేరుకున్నదని ఎన్డీఆర్ఎఫ్ ఐజీ నరేంద్ర బందేలా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి సాధారణ పౌరులను తరలించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఫ్యాక్టరీలోని ఫ్రీజర్ల నుంచి గ్యాస్ లీకవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నారని చెప్పారు.
#WATCH | Punjab: NDRF personnel reach the spot in Giaspura area of Ludhiana where a gas leak claimed 9 lives; 11 others are hospitalised.
Local officials say that the area has been cordoned off. pic.twitter.com/BuxUEb8SCq
— ANI (@ANI) April 30, 2023
#UPDATE | Ludhiana gas leak | "Definitely, it is a gas leak case. The NDRF team is present at the spot to evacuate the people and will conduct the rescue operation. 9 people died in this incident and 11 are sick," says Swati, SDM Ludhiana West. pic.twitter.com/wSCkZw5Sz1
— ANI (@ANI) April 30, 2023