న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకొని మళ్లీ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్లలో 80 శాతం మందికి డెల్టా వేరియంటే సోకినట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనం తేల్చింది. వ్యాక్సినేషన్ తర్వాత ఇన్ఫెక్షన్లపై ఇలాంటి అధ్యయనం చేయడం ఇదే తొలిసారి. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకిన వాళ్లలో మరణాల రేటు చాలా తక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. 677 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీళ్లలో 71 మంది కొవాగ్జిన్, 604 మంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఉన్నారు. ఇద్దరు చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ముగ్గురు వైరస్ వల్ల చనిపోయారు.
ఇవీ అధ్యయనంలోని అంశాలు