న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ప్రపంచవ్యాప్తంగా పాముకాటు వల్ల 2019లో 61 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందులో 80 శాతం మరణాలు భారత్లోనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాం తాల్లో పాముకాటుకు ఔషధం అందుబాటులో లేకపోవడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవించినట్టు అధ్యయనం వెల్లడించింది.
క్వీన్లాండ్లోని జేమ్స్కుక్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. మరణాల విషయంలో భారత్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ (2070), నైజీరియా (1460) ఉన్నాయి. అత్యల్పంగా ఆస్ట్రేలియాలో రెండు మరణాలు మాత్రమే సంభవించాయి.