శ్రీనగర్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. సాధారణ జనంతో పాటు అటు వైద్యులు పెద్ద ఎత్తున కొవిడ్ బారినపడుతున్నారు. తాజాగా ఒకే రోజు శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 80 మంది వైద్యులు, పారామెడికల్స్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో కలకలం సృష్టించింది. జనవరిలో ఇప్పటి వరకు కశ్మీర్లో 546 మంది వైద్యులు వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు.
46 మంది వైద్యులు, 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 15 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా సోకిందని జీఎంసీ శ్రీనగర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్ సలీంఖాన్ టిట్టర్ ద్వారా తెలిపారు. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఫేస్ మాస్క్లు ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు.