ఇటావా, నవంబర్ 16: రైలు ప్రమాదాలు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఢిల్లీ-సహస్ర వైశాలి ఎక్స్ప్రెస్ యూపీలోని ఇటావా జిల్లాలో వెళ్తుండగా బుధవారం రాత్రి ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్-6 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడగా, వారిని దవాఖానలకు తరలించారు.
ప్రమాదానికి కారణం తెలియలేదని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. అలాగే బీహార్లోని సమస్థిపూర్ రైల్వే స్టేషన్ ఔటర్లో సిగ్నల్ కోసం వేచి ఉన్న భాగల్పూర్-దర్భంగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లోని ఒక బోగీలో బుధవారం హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానకు తరలించారు.