బతుకుతామన్న నమ్మకం, మనకేమీ కాదన్న ధైర్యం ఉంటే చాలు ఎలాంటి అనారోగ్యం నుంచైనా బతికి బయటపడవచ్చనంటారు. ఆ మాటని నిజం చేశారు ఈ 75ఏళ్ల వృద్ధురాలు. ముంబైలోని ఘట్ కోపర్ కు చెందిన శైలజ నక్వే కోవిడ్ బారిన పడ్డారు. పెద్ద వయసు దానికి తోడు డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించింది.
కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని.. 24 గంటల కంటే ఎక్కువ బతికే ఛాన్స్ లేదని వైద్యులు తేల్చి చెప్పారు. రోగి పరిస్థితి ఎలా ఉన్నా బతికించడానికే వైద్యుల ప్రయత్నిస్తారు. అలా శైలజ నక్వేకి కూడా కోవిడ్ ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు.
రెమిడిసర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ అతి కష్టం మీద ఆ పెద్దావిడకి వైద్యాన్ని కొనసాగించారు. వెంటిలేటర్ మీద చికిత్సపొందిన శైలజనక్వే నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించారు. 13రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినా ఇంకా పూర్తి ఆరోగ్యవంతురాలు కావడానికి 6నెలల సమయంపడుతుందని వైద్యులు తెలిపారు.
ఇంతటి సీరియస్ కండిషన్ నుంచి శైలజ బయటపడటానికి కారణం ఆమెలోని మనో ధైర్యమే. భయం వల్లే కోవిడ్ రోగులుచాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్లు అంటున్నారు. ట్రీట్ మెంట్ తోపాటు మానసిక ధైర్యం కూడా కోవిడ్ రోగులకు ముఖ్యమంటున్నారు.