అంబాలా: హర్యానాలోని (Haryana) అంబాలాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం ఉదయం అంబాలా (Ambala) వద్ద మయునా నగర్-పంచకుల జాతీయరహదారిపై (Yamuna Nagar-Panchkula highway) ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హనుమకొండలో యువకుడి ఆత్మహత్య
మరోఘటనలో హనుమకొండలో (Hanamkonda) ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ సమీపంలోని కోటిపల్లిలో నరేశ్ అనే యువకుడు రైలు (Train) కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని హనుమకొండలోని గుడిబండల్కు చెందినవాడిగా గుర్తించారు. మహేశ్వరం బిట్స్ కాలేజీలో (BITS Engineering college) ఇంజినీరింగ్ చదువుతున్నాడని, ప్రేమ వ్యవహారమే (Love affair) ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.