పట్నా: బీహార్లోని (Bihar) భగల్పూర్ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు (Explosion) జరిగాయి. జిల్లాలోని తాతర్పూర్లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇండ్లు ధ్వసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కుటుంబం పటాకులు తయారు చేస్తున్నట్లు భగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్కుమార్ సేన్ తెలిపారు. పెలుళ్లవల్ల పక్కనే ఉన్న మూడు ఇండ్లు నేలమట్టమయ్యాయని చెప్పారు. పూర్తివివరాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు.