న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi)మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్నిరోజులుగా నగరంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి వరకు 632 మంది వైరస్ బారినపడ్డారు. ఇది అంతకుముందు రోజుకంటే ఇవి 26 శాతం అధికం. ఫిబ్రవరి 17 తర్వాత ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా, వరుసగా మూడో రోజు కూడా ఒక్క మరణం కూడా నమోదవకపోవడం విశేషం.
ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 461 కేసులు నమోదవగా, ఆదివారం 500, నిన్న 630కిపైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 1274 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని, 41 మంది దవాఖానల్లో చికిత్స పొందుతారని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 14,299 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.