లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా జైలులో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 63కు పెరిగింది. గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన పరీక్షల్లో 36 మంది ఖైదీలకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వ్యాధి బాధితుల సంఖ్య 63కు పెరిగింది. టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల పరీక్షలు చేయలేదని జైలు అధికారులు చెప్పారు. హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు మాదక ద్రవ్యాలకు బానిసగా మారినవారేనని, జైలు బయట కలుషిత సిరంజిలను ఉపయోగించడం వల్ల వీరికి ఈ వ్యాధి సంక్రమించినట్లు చెప్పారు.