అహ్మదాబాద్, డిసెంబర్ 5: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో(చివరి) దశ పోలింగ్ సోమవారం ముగిసింది. 14 జిల్లాల్లోని 93 నియోజకవర్గాల్లో జరిగిన ఈ మలిదశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకు 61 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. కాగా, 2017లో ఇదే 93 స్థానాల్లో 70 శాతం మంది ఓటేశారు. మెహ్సానా జిల్లాలోని మూడు గ్రామాలకు చెందిన దాదాపు 5 వేల మంది ప్రజలు తాజా ఎన్నికలను బహిష్కరించారు. తాగునీటి సమస్యతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మరోవైపు యూపీలోని మైన్పురి లోక్స్థానంలో పాటు పలు రాష్ర్టాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉపఎన్నికలు జరిగాయి. యూపీలోని రామ్పూర్లో అత్యల్పంగా 34 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.