పట్నా: బీహార్లోని కైమూర్ జిల్లా భబువాలో ఓ వృద్ధుడిపై పోలీసులు దాడిచేశారు. ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నాడని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అతడిని లాఠీలతో కొట్టారు. వృద్ధుడు అనికూడా చూడకుండా త్వరగా రోడ్డుపై నుంచి వెళ్లిపోవాలని విచక్షణా రహితంగా దాడిచేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
నవాల్ కిశోర్ పాండే అనే 60 ఏండ్ల వృద్ధుడు పర్మల్పూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం తన విధులు ముగించుకుని సైకిల్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భబువాలోని జైప్రకాశ్ చౌక్లో రోడ్డు దాటుతున్నారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పాండేను ఆగాలని సిగ్నల్ చూపించింది. అది చూడకుండా అతడు రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
అతని వద్దకు చేరుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రోడ్డు మధ్య నుంచి త్వరగా వెళ్లిపోవాలని కొట్టడం ప్రారంభించారు. కొట్టొద్దని వేడుకున్నప్పటికీ వారు వినకుండా కాళ్లు, చేతులపై లాఠీలు ఝులిపించారు. మొత్తం ఇరవై సార్లు తనను కొట్టారని పాండే తెలిపారు. ఓ వ్యక్తి అడ్డుపడటంతో వారు తననకు కొట్టడం ఆపారని చెప్పారు. ఎందుకు కొట్టారో కూడా తనకు తెలియదని వెల్లడించారు. వారి దెబ్బలకు తన కాళ్లు, చేతులు వాపులు వచ్చాయని బాధపడ్డారు. అయితే వారిపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, తనకు న్యాయం జరగాలన్నారు.
కాగా, ఈ వీడియో వైరల్గా మారడంతో విషయం పోలీసు పెద్దలకు చేరింది. ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ లలిత్ మోహన్ శర్మ.. బాధ్యులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు. 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించినట్లు చెప్పారు.
कैसे ये पुलिसकर्मी एक बुज़ुर्ग को डंडे से बेरहमी से पीट रही हैं 😡
बताया जा रहा है बाबा स्कूल में टीचर हैं और उनका क़सूर ये था कि इन मैडमों के सामने इनकी साइकिल गिर गई। @YadavTejashwi जी, कार्यवाही कीजिए pic.twitter.com/CxFrmVRuLJ— Swati Maliwal (@SwatiJaiHind) January 21, 2023