శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహమ్మద్ కుట్రను భద్రతా దళాలు ఛేదించాయి. ఆరుగురిని అరెస్ట్ చేసి పెద్దయెత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. కుల్గాం జిల్లాలో మిర్హమ, దమ్హల్ హంజిపుర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా దాడులు చేపట్టాయి.
రైఫిళ్లు, పిస్తోళ్లు సహా పలు రౌండ్ల మ్యాగ్జైన్లు, గ్రనేడ్లు, మోర్టార్ షెల్స్, వాకీటాకీలు, వైర్లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్నాయి.