న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ పఠానియా గురువారం అనర్హత వేటు వేశారు. అయితే ఈ వేటు క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు కాదని స్పీకర్ స్పష్టం చేశారు.
ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ జారీ చేసిన విప్ను ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ధిక్కరించారని, బడ్జెట్పై ఓటింగ్కు దూరంగా ఉన్నారని, వీరిపై అనర్హత వేటు వేయాలని అధికార కాంగ్రెస్ కోరింది. దీంతో ఎమ్మెల్యేలకు స్పీకర్ షోకాజ్ నోటీస్ జారీ చేసి బుధవారం విచారణకు రమ్మని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ బుదవారం తీర్పును రిజర్వ్ చేసి గురువారం ప్రకటించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించటం హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి.